Posts

పవన్ కోసం ‘దేవర’ టైటిల్

పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు బండ్ల గణేష్‌కు పూనకాలు వచ్చేస్తాయి. స్టేజ్ ఎక్కినా.. మీడియా ముందు మాట్లాడినా.. అతను ఉద్వేగాన్ని ఆపుకోలేడు. మరీ అతి చేస్తాడు అని.. అంతగా భజన చేయాలా అని కామెంట్లు చేసినా అతను పట్టించుకునే రకం కాదు. తన అభిమానం తనది అంటాడు. గతంలో ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో పవన్‌ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల చేసిన ప్రసంగం ఎంత వైరల్ అయిందో తెలిసిందే. పవన్ సైతం కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు ఆ ప్రసంగం వింటూ. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అలాంటి స్త్రోత్రమే మరొకటి చేశాడు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ బండ్ల ఇచ్చిన ఎలివేషన్లకు అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పవన్ నా ‘దేవర’ అంటూ కొత్త మాటను ప్రయోగించాడు బండ్ల. ఈ మధ్య ఎక్కడ చూసినా అదే మాట అంటున్నాడు. ఐతే పవన్ అభిమానులకు ‘దేవర’ అనే పదం బాగా నచ్చేసి.. దాన్ని పవన్‌తో బండ్ల చేయబోయే సినిమాకు టైటిల్‌గా పెట్టాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. ట్విట్టర్లో బండ్లను ట్యాగ్ చేస్తూ వందల మంది అభిమానులు ‘దేవర’ టైటిల్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు తీస్తావో ఏంటో.. ముందు దాన్ని రిజిస్టర్ చేయించేయ్ అంటూ బండ్...

‘రీమేక్‌’ మోజుపై వెంకీని అడిగితే..

టాలీవుడ్లో రీమేక్‌కు పెట్టింది పేరైన స్టార్ హీరోల లిస్టు తీస్తే రాజశేఖర్ ముందు వరుసలో నిలుస్తారు. ఆ తర్వాత ఎక్కువగా రీమేక్‌ల్లో నటించి, ఘనవిజయాలు అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్. చంటి, సుందరకాండ, సూర్యవంశం, రాజా, దృశ్యం, గురు లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి వెంకీ కెరీర్లో. ఇప్పుడు ఆయన పూర్తి చేసిన రెండు చిత్రాలూ (నారప్ప, దృశ్యం-2) కూడా రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడైతే తెలుగులో కథల కొరత ఉండేది. వైవిధ్యమైన కథలూ వచ్చేవి కావు. కానీ గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఎంతో పురోగతి సాధించింది. ఒకప్పుడు మనవాళ్లు కథల కోసం ఎక్కువగా ఆధారపడ్డ కోలీవుడ్ వెనుకబడిపోతే.. మనోళ్లు వాళ్లను దాటి ముందుకెళ్లిపోయారు. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కూడా రీమేక్‌లు చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ‘నారప్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన వెంకీ ముందు విలేకరులు ఇదే ప్రశ్న ఉంచితే ఆయన ఏమన్నారంటే.. ‘‘రీమేక్‌ల్లో నటించడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. సినిమా నాకు బాగా నచ్చి ఉండొచ్చు. అలాగే అలాంటి పాత్రల్లో నటించే అవకాశం అంతకుముందు నాకు రాకపోవడం, ప్రేక్షకులకు మంచి కథ అందించాలని అన...

గోపిచంద్ సినిమాలో సీనియర్ హీరో!

ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు రాజశేఖర్ ఆ తరువాత జోరు తగ్గించారు. ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ‘గరుడ వేగ’ సినిమాలో హీరోగా నటించి హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు. ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఏవరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా తను సిద్ధమని గతంలో రాజశేఖర్ ప్రకటించారు. హీరోగా మార్కెట్ పడిపోయిన సమయంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించాలనుకున్నారు. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. నిజానికి ‘అఖండ’ సినిమాలో ముందుగా రాజశేఖర్ ను విలన్ గా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి తన ఫేవరెట్ యాక్టర్ జగపతిబాబునే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఇది విలన్ రోల్ మాత్రం కాదట. కథను మలుపు తిప్పే కీలకపాత్రలో రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. కానీ రాజశేఖర్ హీర...

కాజల్, రెజీనా.. ఓ మల్టీస్టారర్

కెరీర్లో చాలా లేటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద దృష్టిపెట్టింది కాజల్ అగర్వాల్. రెండేళ్ల కిందట తేజ దర్శకత్వంలో ఆమె ‘సీత’ అనే హీరోయిన్ ప్రధాన సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరోవైపు బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లోనూ కాజల్ లీడ్ రోల్ చేసింది. కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఐతే కాజల్ కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే అందులో లీడ్ రోల్ చేస్తున్నది కాజల్ మాత్రమే కాదు. ఇంకో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అంటే ఇది లేడీ మల్టీస్టారర్ అన్నమాట. ఇందులో మరో స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటిస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కడి హీరోయిన్ జనని మరో లీడ్ రోల్ చేసింది. ఇంకో కొత్తమ్మాయి కూడా నటించింది. ఈ చిత్రానికి ‘కరుంగాపియం’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేస్తున్న నలుగురు అమ్మాయి ముఖాలను సైడ్ నుంచి వరుస క్రమంలో చూపించారు. అందరిలోకి ఎక్కువ ఆకర్షిస్తున్నది కాజలే. ఎందుకంటే ఆమె తన శైలికి భిన్నంగా పక్...

తన క్రెడిట్ ఏం లేదంటున్న జక్కన్న

Image
రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నిజానికిది ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడీ మేకింగ్ వీడియో రాబోతోందని కొన్ని రోజుల ముందు వరకు ఎలాంటి సంకేతాలు లేవు. కొత్త సినిమాల విడుదలపై ఎక్కడలేని సందిగ్ధత నెలకొన్న ఏ చిత్ర బృందం నుంచి అప్‌డేట్స్, ప్రమోషనల్ వీడియోలు ఆశించట్లేదు జనాలు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ టీం ఊహించని విధంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. అది ఒక రేంజ్‌లో ఉండటంతో ప్రేక్షకులు థ్రిల్లయిపోయారు. ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత హెచ్చు స్థాయికి తీసుకెళ్లిపోయింది ఈ వీడియో. రాజమౌళి మార్కు భారీతనం.. అదిరిపోయే సెట్టింగ్స్.. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్.. హీరోలిద్దరి గూస్ బంప్ షాట్స్.. అలాగే లొకేషన్లో రాజమౌళికి ఎలివేషన్ ఇస్తున్న షాట్స్.. ఇంకా స్టన్నింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అదిరిపోయే స్పందన తెచ్చిపెట్టాయి. ఈ వీడియో చూసి అందరూ రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. మేకింగ్ వీడియోలో కూడా జక్కన్న తన మార్కు చూపించాడంటూ పొగిడేస్తున్నారు. ఐతే రాజమౌళి మాత్రం ఈ క్రెడిట్ తనకు దక్కాల్సింది కాదన్నాడు. గత...

ఎన్టీఆర్ సినిమాకు 200 కోట్లు?

రాజమౌళితో ‘బాహుబలి’ చేశాక ప్రభాస్ ఫాలోయింగ్, మార్కెట్ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో లీడ్ రోల్స్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మార్కెట్ కూడా అమాంతం పెరుగుతుందనే అంచనాలే ఉన్నాయి. ‘బాహుబలి’కి దీటుగా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా తారక్, చరణ్ మంచి పాపులారిటీ సంపాదించాక వాళ్లు భవిష్యత్తులో చేయబోయే సినిమాల రేంజే వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పారితోషకాలు పెరుగుతాయి. కథల స్థాయి పెరుగుతుంది. కాస్ట్ అండ్ క్రూ రేంజ్ ఎక్కువుంటుంది. బహు భాషల్లో రిలీజ్ ఉంటుంది. అలాంటపుడు సినిమాల బడ్జెట్ పెరగకుండా ఎలా ఉంటుంది? ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ను ముందు రూ.50 కోట్లలో తీయాలనుకున్నారు. కానీ చివరికి దాని బడ్జెట్ రూ.300 కోట్లను దాటింది. తారక్, చరణ్‌‌ల సినిమాల రేంజ్ ఈ స్థాయిలో కాకున్నా పెరగడం మాత్రం పక్కా. ఆల్రెడీ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న కొత్త చిత్రం బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అంటున్నారు. ఇప్పుడు తారక్ కూడా అదే క్లబ్బులో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంల...

తిమ్మరసు భలే వెరైటీగా చేశాడే

Image
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న తొలి చిత్రం.. తిమ్మరసు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘కిరాక్ పార్టీ’ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి రూపొందించిన చిత్రమిది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఒక పాటను రిలీజ్ చేసింది. అది ఇన్‌స్టంట్‌గా జనాలకు నచ్చేస్తోంది. ఐతే అది రెగ్యులర్ పాటేమీ కాదు. ఈ పాట సినిమాలో కూడా ఉండదు. బాలీవుడ్ స్టయిల్లో చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. దీని ఇంట్రో భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్లు సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్‌లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన బ్రహ్మాజీ, వైవా హర్ష కలిసి ఈ ఇంట్రోను వినోదాత్మకంగా మార్చారు. బ్లాక్ సూట్లేసుకుని కళ్లజోళ్లు పెట్టుకుని కెమెరాను ఫేస్ చేస్తూ ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, హర్ష నిలబడి ఉంటే.. వెనుక నుంచి సత్యదేవ్ వచ్చి.. ‘తిమ్మరసు’ సినిమాలో నిజానికి ఒక లవ్ సాంగ్ ఉందని.. కానీ లెంగ్త్ దృష్ట్యా దాన్ని తీసేశామని.. ఐతే ఈవిడ (ప్రియాంక) ...