Posts

Showing posts from June, 2021

అల్లు వారి రామాయ‌ణం.. హాట్ అప్‌డేట్స్

రామాయ‌ణం మీద ఇండియాలో వివిధ భాష‌ల్లో చాలా సినిమాలే వ‌చ్చాయి ఇప్ప‌టిదాకా. ఐతే వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా భారీ స్థాయిలో రామాయ‌ణ గాథ‌కు వెండితెర దూరం ఇవ్వాల‌ని కొన్నేళ్ల కింద‌ట టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మధు మంతెన త‌ల‌పోశారు. వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో రామాయ‌ణం మీద సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌నే వ‌చ్చింది. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది. మ‌ధ్య‌లో చాలా కాలం పాటు ఈ సినిమా గురించి చ‌ప్పుడు లేక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ ఆ ప్ర‌చారాన్ని ఖండిస్తూ మ‌ళ్లీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్ప‌టికే కొన్ని ఊహాగానాలు న‌డిచాయి. ఐతే నిర్మాత‌ల్లో ఒక‌రైన మ‌ధు మంతెన తాజాగా త‌మ చిత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇండియాలో ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ చూడ‌నంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతామ‌ని.. అలాగే ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోని అత్యంత పెద్ద స్టార్లు ఈ సినిమాలో న‌టిస్తార‌ని మ‌ధు చెప్పాడు. ఈ ఏడాది దీపావ‌ళి నాడు త‌మ రామాయ‌ణంలో ముఖ్య పా...

ఆ హీరోయిన్ ద‌శ తిరిగిన‌ట్లుందే..

బాలికా వ‌ధు సీరియ‌ల్‌లో బాల న‌టిగా దేశ‌వ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన న‌టి అవికా గోర్. ఆ ఫేమ్‌తోనే టీనేజీలోనే తెలుగులో ఉయ్యాల జంపాల‌లో అవ‌కాశం ద‌క్కించుకుందామె. ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌యి అవికాకు మ‌రిన్ని అవ‌కాశాలు తెచ్చిపెట్టింది. కానీ స‌రైన సినిమాలు ఎంచుకోక అవికా కెరీర్ గాడి త‌ప్పింది. మ‌ధ్య‌లో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా మాత్ర‌మే ఆడింది. దానికి ముందు, త‌ర్వాత ఫ్లాపులు రావ‌డంతో అవికా కెరీర్‌కు బ్రేకులు ప‌డిపోయాయి. ఒక‌సారి ఫేడ‌వుట్ అయ్యాక మ‌ళ్లీ హీరోయిన్లు పుంజుకోవ‌డం క‌ష్టం. దీంతో అవికా క‌థ ముగిసిన‌ట్లే అనుకున్నారంతా. కానీ ఈ మ‌ధ్య బరువు త‌గ్గి నాజూగ్గా మారి తిరిగి టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అవికా.. ఉన్న‌ట్లుండి ఫుల్ బిజీ అయిపోవ‌డం విశేషం. ఆమె చేతిలో అర‌డ‌జ‌నుకు పైగా సినిమాలుండ‌టం గ‌మ‌నార్హం. బుధ‌వారం అవికా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న కొత్త చిత్రాల మేక‌ర్స్ త‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట‌ర్లు, ప్రోమోలు వ‌దిలారు. అవ‌న్నీ చూసి అవికా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంత బిజీ అయిపోయిందా అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. గీతా ఆర్ట్స్-2 బేన‌ర్లో క‌ళ్యాణ్ దేవ్ హీరోగా శ్రీధ‌ర్...

వెంకీ ఫ్యాన్స్ మామూలుగా లేరు

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ‘నారప్ప’, ‘దృశ్యం-2’ చిత్రాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయబోతుండటం లాంఛనమే అంటున్నారు. ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్‌లో జులై 24న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ‘దృశ్యం-2’ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానున్నట్లు చెబుతున్నారు. ఐతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెంకీ తన సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయబోతుండటం అభిమానులకు రుచించట్లేదు. వెంకీ ఫ్యాన్స్ మామూలుగా అంత అగ్రెసివ్‌గా ఉండరు కానీ.. ఈ నిర్ణయం పట్ల మాత్రం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వెనుకాడట్లేదు. ముఖ్యంగా మంచి మాస్ మూవీ అయిన ‘నారప్ప’ను ఓటీటీలో వదలడం ఏంటన్నది వాళ్ల అభ్యంతరం. ‘నారప్ప’ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే ఉద్యమం చేస్తున్నారు వెంకీ అభిమానులు. వాళ్లు వెంకీని ఏమీ అనట్లేదు కానీ.. నిర్మాత సురేష్ బాబును విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్లు ఆగిన వాళ్లు.. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లు తెరుచుకో...

తాప్సీపై కంగనా మళ్లీ..

బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకు పోటీగా తయారైన తాప్సి మీద కంగనా రనౌత్ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు తాప్సి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగనా. తాప్సి తనను కాపీ కొడుతుంటుందని.. తనలాగే కనిపించడానికి ప్రయత్నిస్తుందని.. ఆమె ఒక బి గ్రేడ్ యాక్ట్రెస్ అని.. ఇలా ఎన్నోసార్లు విమర్శలు చేసింది. తాప్సి చాలాసార్లు సంయమనం పాటిస్తుంటుంది కానీ.. కొన్ని సార్లు మాత్రం ఆమె కూడా నోటికి పని చెబుతుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కంగనా గురించి అడిగితే చాలా మామూలుగానే జవాబిచ్చిందామె. కానీ అవతలి వాళ్లు సైలెంటుగా ఉన్నా కూడా కెలికే రకమైన కంగనా.. తన గురించి వేరే వాళ్లు కామెంట్ చేస్తే ఊరుకుంటుందా? ఎప్పట్లాగే రెచ్చిపోయి తాప్సి గురించి ఎలా పడితే అలా మాట్లాడేసింది. ఆమెను మరోసారి బి గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తేలిక చేసే ప్రయత్నం చేసింది. కంగనా చేసిన అతితో ఆమె మీద ట్విట్టర్ బ్యాన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు పరిమితం అయింది. ఐతే ట్విట్టర్లో కంగనా లేకపోవడం లోటుగా ఉందా అని ఓ ఇంటర్వ్యూలో తాప్సీని అడిగితే.. అలాంటిదేమీ లేదని తేల్చేసింది. ఈ కామెంట్ మీద ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ...

మరో పీరియాడిక్ సినిమాలో కళ్యాణ్ రామ్!

చాలా ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు కళ్యాణ్ రామ్. కానీ ఆయన నటిస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎన్నో ఆశల పెట్టుకొని నటించిన ‘118’, ‘ఎంతమంచి వాడవురా’ వంటి సినిమాలు కూడా కళ్యాణ్ రామ్ కి నిరాశనే మిగిల్చాయి. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఏదైనా కొత్త ఎలిమెంట్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఈ క్రమంలో ఆయన వద్దకు వస్తోన్న పీరియాడిక్ సినిమాలపై ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘బింబిసార’ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. మల్లిడి వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ మరో పీరియాడిక్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 1950 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఒక కథను ఇటీవల నిర్మాత అభిషేక్ నామా ఓకే చేసినట్లు తెలుస్తోంది. నవీన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించబోతున్నాడు...

రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ డైరెక్టర్!

‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ ఇలాంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ప్రసన్న కుమార్ అనే రైటర్ తో కలిసి తన సినిమాలను రూపొందిస్తుంటారు. కథ, మాటలు ప్రసన్న రాస్తే.. దాన్ని త్రినాధరావు తెరకెక్కిస్తారు. అయితే చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ప్రసన్న కుమార్ మొత్తం పనులన్నీ చూసుకుంటే త్రినాధరావు కేవలం పర్యవేక్షణ చేస్తుంటారని టాక్. తాజాగా దీనిపై దర్శకుడు త్రినాధరావు క్లారిటీ ఇచ్చారు. ప్రసన్న కుమార్ వర్క్ కేవలం కథ, మాటలను వరకేనని స్పష్టం చేశారు. ప్రసన్న రాసే డైలాగ్స్ లో కృష్ణా జిల్లా యాస ఉంటుందని.. ఎలా పలకాలో ప్రసన్న చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో అతడిని సెట్స్ కి రమ్మంటానని ప్రసన్న తెలిపారు. అంతేతప్ప డైరెక్షన్ కు, ప్రసన్నకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రసన్నను దర్శకుడిగా ప్రయత్నించమని ప్రోత్సహించానని.. రెండు, మూడు సార్లు ప్రయత్నించి మరింత కసరత్తు చేయాలని తన దగ్గరకు తిరిగి వచ్చేశాడని త్రినాధరావు తెలిపారు. ప్రస్తుతం రవితేజ సినిమా స్క్రిప్...

‘మా’ ఎన్నికల్లో బాలయ్య మద్దతు ఎవరికి?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కొన్ని రోజులుగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండగానే.. ఈ లోపే వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నరసింహారావు, ఒ.కళ్యాణ్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, విష్ణు, సీవీఎల్ ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మిగతా వాళ్ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధ్యక్ష పదవికి పోటీ పడటంపై ఆలోచిస్తున్నానని.. ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని జీవిత అన్నారు. ఆమె పోటీ చేయడం దాదాపు ఖాయం అంటున్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ పెద్దల్లో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి.. ప్రకాష్ రాజ్‌ను సపోర్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు. చిరు సోదరుడు నాగబాబు ఈ విషయంపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు. చిరు తర్వాత అందరూ మద్దతు పరంగా ఆలోచించేది నందమూరి బాలకృష్ణ గురించే. ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తారన్నది ఉత్కంఠభరితంగా మారింది. చిరు.. ప్రకాష్ రాజ్‌ను సపోర్ట్ చేసిన నేపథ్యంలో బాలయ్య మంచు విష్ణు లేదా జీవితకు మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ...

అయ్యో.. సీనియర్ నటి ఇంట మరో విషాదం

రోజుల వ్యవధిలో కొడుకును, భర్తను కోల్పోవడం కంటే ఒక మహిళకు పెద్ద విషాదం ఏముంటుంది? టాలీవుడ్ సీనియర్ నటి కవిత పాపం ఈ పరిస్థితినే ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల కిందటే కవిత కొడుకు సాయి రూప్ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త దశరథ రాజ్ కన్ను మూశారు. ఆయన కూడా కరోనాతో పోరాడుతూనే బుధవారం కన్నుమూశారు. కవిత కొడుకు కరోనా బారిన పడ్డ కొన్ని రోజులకు ఆమె భర్తకు కూడా వైరస్ సోకింది. ఆయన కొన్ని వారాల పాటు వైరస్‌తో పోరాడారు. కరోనా సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆరోగ్యం విషమించింది. కొడుకు మరణం గురించి కూడా దశరథ రాజ్‌కు తెలియకుండా దాచారని.. ఆయన కోలుకుని వచ్చాక విషయం చెప్పాలని చూశారని.. ఐతే ఈలోపు ఆయన మరణించారని అంటున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దశరథ రాజ్ కన్ను మూశారు. గత నెలలో ముందుగా సాయి రూప్ కరోనా బారిన పడ్డాడు. అతను హోం ఐసొలేషన్లో ఉంటూ కోలుకునే ప్రయత్నం చేయగా.. కొన్ని రోజుల తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చిన్న వయసే కావడంతో అతను క్షేమంగా బయటికి వస్తాడని ఆశించారు. కానీ అతను ప్రాణాలు కోల్ప...

అఖిల్ తో మైత్రి ప్లాన్ ఇదే!

స్టార్ కిడ్ అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. అందులో ఏదీ కూడా అఖిల్ కి భారీ సక్సెస్ ను తీసుకురాలేదు. దీంతో తన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. అనీల్ సుముఖ నిర్మిస్తోన్న ఈ సినిమా జూలైలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే ఇప్పుడు అఖిల్ మరో సినిమా ఒప్పుకున్నాడని సమాచారం. టాలీవుడ్ హీరోలతో వరుస ప్రాజెక్ట్ లను చేపడుతున్న మైత్రి మూవీస్ సంస్థ గతంలో అఖిల్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీనువైట్ల వ్యవహరించబోతున...

అల్లరోడు రైట్ రైట్

ఈ ఏడాది ఆరంభంలో ‘నాంది’ సివిమా విడుదలవుతుంటే అది హిట్టు కావాలని ఇండస్ట్రీ మొత్తం కోరుకుంది. అలాగే ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అని లేకుండా అందరూ కూడా ‘నాంది’ బాగా ఆడాలని ఆశించారు. అందుక్కారణం.. అల్లరి నరేష్. ఒకప్పుడు తన కామెడీ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులనూ కడుపుబ్బ నవ్వించిన నరేష్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకప్పుడు బాగా నవ్వించాడన్న అభిమానానికి తోడు వ్యక్తిగా కూడా మంచి పేరుండటం వల్ల అందరూ అతడి విజయాన్ని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్లే ‘నాంది’ మంచి విజయం సాధించి అల్లరోడి కెరీర్‌కు ఊపిరులూదింది. ఐతే హిట్టు కొట్టడం కంటే దాన్ని నిలబెట్టుకునేలా తర్వాత మంచి సినిమాలు చేయడం కీలకం. ఐతే ఈ విషయంలో నరేష్ బాగా ఆలోచించి జాగ్రత్తగానే తర్వాతి సినిమాను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. నరేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతడి కొత్త చిత్రాన్ని ప్రకటించారు ఈ రోజు. ఇది ఫస్ట్ ఇంప్రెషన్లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘సభకు నమస్కారం’ అంటూ ఆకర్షణీయ టైటిల్ పెట్టడమే కాక.. ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఒక పొలిటికల్ మీటింగ్‌లో హీరో మాట్లాడుతున్నట్లు చూపిస్తూ అతడి వెను...

ఇంటర్వెల్‌ వచ్చేసింది.. సినిమా ఎలా ఉంది?

చూస్తుండగానే ఏడాదిలో సగం గడిచిపోయింది. సరిగ్గా ఏడాది మధ్యలో ఉన్నాం. మామూలుగా అయితే ఏడాది సగం పూర్తి కాగానే అప్పటిదాకా రిలీజైన సినిమాల సమీక్ష జరుపుకోవాలి. కానీ గత ఏడాది లాగే ఈసారి కూడా సినిమాలకు కరోనా దెబ్బ తప్పలేదు. తొలి క్వార్టర్ వరకు మాత్రమే సినిమా బండి సజావుగా నడిచింది. రెండో క్వార్టర్ ఆరంభంలో కరోనా సెకండ్ వేవ్ మొదలై సినీ కార్యకలాపాలన్నింటినీ ఆపేసింది. అయినప్పటికీ ఇంత వరకు తెలుగు సినిమా ప్రోగ్రెస్ ఏంటో ఒకసారి చూడాల్సిన సమయమిది. వేరే సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే ఈ ఏడాది ఉన్న కొద్ది సమయంలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థియేటర్లు మూతపడ్డానికి ముందు చివరగా థియేటర్లలో నడిచిన ‘వకీల్ సాబ్’ అంచనాలకు తగ్గట్లే మంచి విజయం సాధించింది. ఏడాదికి పైగా విరామం తర్వాత తెలుగులో రిలీజైన భారీ చిత్రం ఇదే. తొలి ఆరు నెలల్లో ఇదే హైయెస్ట్ గ్రాసర్. ఏపీలో టికెట్ల రేట్లలో నియంత్రణ, అదనపు షోలు లేకపోవడం వల్ల దీని వసూళ్లపై ప్రభావం పడింది. అయినప్పటికీ ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వచ్చింది. ఇక ఈ ఏడాది పెట్టుబడి-రాబడి పరంగా బిగ్గెస్ట్ హిట్ అంటే ‘జాతిరత్నాలు’నే. ఈ చిత్రం రూ.35 కోట...

జులై 24న నార‌ప్ప రిలీజ్?

కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్లో కొత్త సినిమాల సంద‌డి మొద‌ల‌వ‌బోతోంది. థియేట‌ర్లు పూర్తి స్థాయిలో న‌డ‌వ‌డానికి ఇంకా కొన్ని నెల‌లు స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో కొత్త చిత్రాల‌ను ఓటీటీ బాట ప‌ట్టించే ప‌నిలో ఉన్నారు నిర్మాత‌లు. ఈ క్ర‌మంలోనే అగ్ర నిర్మాత సురేష్ బాబు త‌న ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన మూడు చిత్రాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిన‌ట్లు స‌మాచారం బ‌య‌టికొచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో విరాట ప‌ర్వం సంగ‌తే కొంచెం అనుమానంగా ఉంది కానీ.. నార‌ప్ప‌, దృశ్యం-2 చిత్రాలు మాత్రం ఓటీటీ బాట ప‌ట్ట‌డం ప‌క్కా. ఇందులో ముందుగా నార‌ప్ప ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని జులై 24న రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం కూడా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. నార‌ప్ప చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంద‌ట‌. పెట్టుబ‌డి మీద మంచి లాభానికే ఈ సినిమాను ప్రైమ్ వాళ్ల‌కు అమ్మిన‌ట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. నార‌ప్ప ఒరిజిన‌ల్ అసుర‌న్ అమేజాన్ ప్రైమ్‌లోనే ఏడాదిన్న‌ర‌గా అందుబాటులో ఉంది. ఇప్పుడు రీమేక్‌ను కూడా అదే ఓటీటీ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వెంకీ స‌ర...

రెంటికీ చెడ్డ తెలుగు ప్రేక్షకుడు

దేశంలో సినిమాల‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఉన్నంత ప్రేమ ఇంకెవ‌రికీ లేద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ విష‌యం ఎన్నోసార్లు రుజువైంది. ఒక రీజ‌నల్ ఇండ‌స్ట్రీ అయిన టాలీవుడ్లో దేశంలోనే అత్య‌ధిక సినిమాలు తెర‌కెక్కుతున్నాయంటే.. బాలీవుడ్ సినిమాల‌కు దీటుగా వ‌సూళ్లు రాబ‌డుతున్నాయంటే అది మ‌న వాళ్ల సినిమా అభిమానం వ‌ల్లే. గ‌త ఏడాది క‌రోనా దెబ్బ నుంచి కోలుకోలేక మిగ‌తా సినీ ప‌రిశ్ర‌మ‌ల‌న్నీఅల్లాడిపోతుంటే.. టాలీవుడ్ మాత్రం చాలా త‌క్కువ స‌మ‌యంలోనే పుంజుకుని సాధార‌ణ స్థితికి చేరుకుంది. ఐతే క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. సినీ వినోదానికి తెర‌ప‌డింది. ఐతే గ‌త ఏడాది లాక్ డౌన్ ప‌డ్డ కొంత కాలానికి ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు వ‌రుస‌గా రిలీజ‌వుతూ వ‌చ్చాయి. వాటితో కొంత‌మేర లోటు భ‌ర్తీ అయింది. కానీ సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాక మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమాలు క‌ర‌వైపోయాయి. ఈసారి లాక్ డౌన్ త‌క్కువ రోజులే ఉంటుంద‌ని.. మ‌ళ్లీ త్వ‌ర‌గానే థియేట‌ర్లు పునఃప్రారంభం అవుతాయ‌ని భావించి కొత్త సినిమాల‌ను ఓటీటీల‌కు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు వెనుకంజ వేశారు. పైగా గ‌త ఏడాది లాక్ డౌన్ బ్రేక్ త‌ర్వా...

రాజ‌మౌళి స్టిల్ వ‌దిలాడో లేదో..

ఓప‌క్క రాజ‌మౌళి.. ఇంకో ప‌క్క జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌.. ఇలాంటి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా మీద అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? అందులోనూ బాహుబ‌లి లాంటి మెగా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్లో సినిమా కుద‌ర‌డంతో ఆర్ఆర్ఆర్‌పై అంచ‌నాలు ఆరంభంలోనే తార స్థాయికి చేరాయి. ఇక సినిమా మేకింగ్ సాగుతూ.. కొన్ని పోస్ట‌ర్లు, ప్రోమోలు వ‌దిలేస‌రికి ఆ అంచ‌నాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం మొత్తంగా భార‌తీయ ప్రేక్ష‌కులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కాగా క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత షూటింగ్ పునఃప్రారంభించ‌డం.. బ్యాలెన్స్ టాకీ పార్ట్ పూర్తి చేసి.. ఇక రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలుంద‌ని అప్ డేట్ ఇవ్వ‌డంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఐతే ఈ అప్‌డేట్‌తో పాటుగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. బుల్లెట్ మీద తార‌క్, చ‌ర‌ణ్ చాలా ఉత్సాహంగా దూసుకెళ్తున్న దృశ్యం క‌నువిందుగా ఉండ‌టంతో దీన్ని చ‌ర‌ణ్‌, తార‌క్ అభిమానులిద్ద‌రూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటో మీమ్ క్రియేట‌ర్ల‌కు కూడా మ‌హ బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. తార‌క్, చ‌ర‌...

ఓటీటీలోకి మరో భారీ చిత్రం

థియేటర్లలో సినిమాలు లేక, ఓటీటీల్లోనూ కొత్త చిత్రాలు రాక సినీ ప్రియుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వారం వారం కొత్త సినిమాలు చూసే ప్రేక్షకులకు ఇది సంకట స్థితే. లాక్ డౌన్ షరతులను సడలించి థియేటర్లకు వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే పేరున్న కొత్త చిత్రాలు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు నెమ్మదిగా ఓటీటీ బాట పడుతున్నారు. తెలుగులో ఇప్పటికే మాస్ట్రో, నారప్ప, దృశ్యం-2 లాంటి చిత్రాలను ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటి గురించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. ఈలోపు ఓ తమిళ బిగ్ బడ్జెట్ మూవీ.. ఓటీటీ డీల్ పూర్తి చేసుకుంది. చిన్న చినన పాత్రలతో మొదలుపెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డాక్టర్’ థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. ‘డాక్టర్’ సినిమాను హాట్ స్టార్ మంచి రేటు పెట్టి కొనేసింది. తమ ఫ్లాట్ ఫాంలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు హాట్ స్టార్ అధికారికంగానే ప్రకటించింది. ఇంతకుముందు నయనతారతో ‘కోలమావు కోకిల’ (తెలుగులో కోకో కోకిల) చిత్రాన్ని రూపొందించిన నెల్సన్ ది...

అక్షయ్ కుమార్ తో రకుల్ రొమాన్స్!

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయింది. అజయ్ దేవగన్ తో రెండు సినిమాలు చేస్తోన్న రకుల్ తాజాగా మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న కొత్త సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. నిజానికి ముందుగా కియారా అద్వానీ లేదా శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ ఛాన్స్ రకుల్ కి వెళ్లిందని తెలుస్తోంది. అజయ్ దేవగన్ తో రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో అక్షయ్ పక్కన కూడా ఆమె సూట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ‘బెల్ బాటమ్’ దర్శకుడు రంజిత్ తివారి తెరకెక్కించనున్న ఈ సినిమాను నలభై రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. రకుల్ కూడా వారు అడిగిన కాల్షీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఇదే గనుక నిజమైతే బాలీవుడ్ లో రకుల్ కి డిమాండ్ పెరగడం ఖాయం. కానీ వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీకి యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి. ఇక తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా పూర...

తాప్సీ లిస్ట్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

టాలీవుడ్ లో తాప్సీని కేవలం గ్లామర్ హీరోయిన్ గానే చూపించారు దర్శకులు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటించి తెలుగులో ఓ మోస్తరు పేరు సంపాదించుకుంది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్లిందో అక్కడ ఆమెకి వరుస అవకాశాలు దక్కాయి. అవి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం. దాదాపు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా తాప్సీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘పింక్’, ‘బద్లా’, ‘తప్పడ్’ లాంటి సినిమాల్లో తాప్సీ తనలోని కొత్త యాంగిల్ తో ఆకట్టుకుంటుంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు తాప్సీ బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు కూడా తాప్సీపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. బాలీవుడ్ లో చాలా కాలంగా షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇటీవల రాజ్ హిరానీ వినిపించిన కథ షారుఖ్ కి బాగా నచ్చిందట. దీంతో ఆయన ఓకే చెప్పేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన...

‘ఆర్ఆర్ఆర్’ అనుకున్నట్లే వచ్చేస్తుందా?

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మరోసారి పెద్ద సినిమాల మేకింగ్ ఆలస్యమైంది. విడుదల వాయిదా పడటం అనివార్యమైంది. ఓ మోస్తరు స్థాయి సినిమాలనే వాయిదా వేయక తప్పలేదు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎలా ఉంటారనే అంతా అనుకున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అయిన రాజమౌళి మామూలు పరిస్థితుల్లోనే డెడ్ లైన్లు అందుకోవడం కష్టం. అలాంటిది అక్టోబరు 13న డేట్ ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తుండగా దాదాపు మూడు నెలలు షూటింగ్ ఆగిపోతే ఇక ఆ డేట్‌ను అందుకోవడం అసాధ్యం అనే అనుకున్నారంతా. వచ్చే సంక్రాంతికో లేదంటే వేసవికో ‘ఆర్ఆర్ఆర్’ చూసుకోవాల్సిందే అని ఫిక్సయిపోయారు. కానీ ఈ మధ్య ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. అక్టోబరు 13నే తమ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా కూడా జనాలకు దీనిపై నమ్మకం కలగలేదు. కానీ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి వచ్చిన షూటింగ్ అప్‌డేట్ చూస్తే అక్టోబరు 13నే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమనే అనిపిస్తోంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్లుగా తాజాగా ప్రకటించిన నేపథ్యంలో డెడ్ లైన్ అందుకోవడం కష్టం కాదనే అభిప్ర...

కత్తి మహేష్ హెల్త్ అప్‌డేట్

ప్రముఖ క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గాయాలు తీవ్రమైనవి కావడం, పరిస్థితి విషమించడంతో ముందు నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేసి, తర్వాత చెన్నైకి తరలించాల్సి వచ్చింది. హితులతో పాటు శత్రువులను కూడా అదే స్థాయిలో సంపాదించుకున్న కత్తి మహేష్ పరిస్థితేంటో తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరు కొట్టి సెర్చ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ సిద్ధారెడ్డి లాంటి కొందరు కత్తి మహేష్ మిత్రులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిని అప్‌డేట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కత్తి మహేష్‌కు అవసరమైన సర్జరీలన్నీ పూర్తయ్యాయి. ఆయన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలించారు. కత్తి మహేష్‌‌కు ముక్కు, కళ్లు, నుదురు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ భాగాల్లో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. మహేష్‌కు ఒక కంటికి చూపు పోయిందని, మొత్తంగా ఆయన చూపు కోల్పోయారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ విషయంలో అధికారిక సమాచారం ఏదీ లేదు. కత్తి మ...

నితిన్ లాట‌రీ కొట్టిన‌ట్లే

యువ క‌థానాయ‌కుడు నితిన్ కొత్త చిత్రం మాస్ట్రో థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ వాళ్లు కొనేశారు. డీల్ ముగిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఆగ‌స్టులో మాస్ట్రోకు ప్రిమియ‌ర్స్ ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు ఎంత రేటు ప‌లికింద‌న్న దానిపై అంద‌రూ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ మొత్తం రూ.32 కోట్ల‌ని స‌మాచారం. కొన్ని నెలల ముందు వ‌ర‌కు అయితే నితిన్ సినిమా మీద ఇంత రేటు పెట్ట‌డం క‌రెక్టే అనిపించొచ్చు. కానీ ఇప్పుడున్న అత‌డి మార్కెట్ ప్ర‌కారం చూస్తే ఈ రేటు ఎక్కువే. ఎందుకంటే గ‌త ఏడాది భీష్మ‌తో పెద్ద హిట్టు కొట్టి ఊపు మీదున్న నితిన్.. కొత్త ఏడాదిలో చెక్, రంగ్ దె లాంటి ప‌రాజ‌యాలు ఎదుర్కొన్నాడు. దీంతో అత‌డి మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మాస్ట్రోను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఏమాత్రం ఆడుతుందో అన్న డౌట్లున్నాయి. ఎందుకంటే ఇది రీమేక్. పైగా థియేట‌ర్లు ఎప్ప‌టికి తెరుచుకుంటాయో.. తెరుచుకున్నా సినిమాలు మునుప‌టిలా ఎప్ప‌టికి ఆడ‌తాయో తెలియ‌దు. పైగా నితిన్ రెండు వ‌రుస ఫ్లాపుల మీదున్న...

మా ఎన్నిక‌ల‌పై కోట ఆగ్ర‌హం

ఇప్పుడు టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లే హాట్ టాపిక్. ఎల‌క్ష‌న్ల‌కు ఇంకా మూడు నెల‌లు స‌మయం ఉన్న‌ప్ప‌టికీ.. ఈలోపే వేడి రాజుకుంది. ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్య‌క్ష ప‌ద‌వికి త‌మ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించ‌డం.. జీవిత‌, హేమ‌, సీవీఎల్ న‌ర‌సింహా రావు లాంటి వాళ్లు కూడా రేసులో నిల‌వ‌డంతో ఎన్నిక‌లు రంజుగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా ఈ ఎన్నిక‌లు వివాదాస్ప‌దం అవుతాయేమో అన్న సంకేతాలు కూడా గోచ‌రిస్తున్నాయి. గ‌త నాలుగేళ్ల‌లో మా కార్య‌క‌లాపాల‌పై ప్ర‌కాష్ రాజ్, నాగ‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డం.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేష్ ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్ట‌డం ఇప్ప‌టికే చ‌ర్చ‌నీయాంశం అయిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు మా ఎన్నిక‌ల వ్య‌వ‌హారంపై స్పందించారు. ఓ టీవీ ఛానెల్ చ‌ర్చా కార్య‌క్రమంలో వీడియో కాల్ ద్వారా పాల్గొన్న కోట శ్రీనివాస‌రావు.. మా ఎన్నిక‌ల‌కు సంబంధించి రెండు ప్ర‌శ్న‌లు సంధించారు. అసలు మా ఎన్నికలను ఎవరు అనౌన్స్‌ చేశారని ఆయ‌న ప్రశ్నించారు. ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా.. ఏదో ప్యానల్‌ అని...

మ‌ళ్లీ ప‌వ‌న్ వెర్స‌స్ ప్ర‌కాష్ రాజ్‌

హిట్ పెయిర్ అనిపించుకున్న హీరో హీరోయిన్లు కలిసి మ‌ళ్లీ సినిమా చేస్తే ఎలా ఆస‌క్తి రేకెత్తుతుందో.. ఒక సినిమాలో సై అంటే సై అంటూ త‌ల‌ప‌డ్డ హీరో, విల‌న్ మ‌ళ్లీ మ‌రో సినిమాలో క‌లిసి న‌టించినా అంతే ఆస‌క్తి క‌లుగుతుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌మ‌వుజ్జీ అనిపించి.. అత‌డికి విల‌న్‌గా కెమిస్ట్రీ బాగా పండించిన వాళ్ల‌లో ప్ర‌కాష్ రాజ్ పేరు ముందు చెప్పుకోవాలి. బ‌ద్రి సినిమాలో నందాగా ప్ర‌కాష్ రాజ్ పండించిన విల‌నీ.. ప‌వ‌న్‌కు, ఆయ‌న‌కు మ‌ధ్య వ‌చ్చిన స‌న్నివేశాలు ఎలా పేలాయో తెలిసిందే. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు దాటినా ఇంకా అందులోని స‌న్నివేశాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఈ మ‌ధ్యే వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌వ‌న్, ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి త‌ల‌ప‌డ్డారు. ఈసారి వారి మ‌ధ్య యాక్ష‌న్ ఘ‌ట్టాలేమీ లేక‌పోయినా.. కోర్టులో లాయ‌ర్లుగా ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డే స‌న్నివేశాల‌ను బాగా పండించారు. ఐతే ఈసారి అలా కాకుండా బ‌ద్రిలో మాదిరి ఫిజిక‌ల్‌గా త‌ల‌ప‌డ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది టాలీవుడ్లో. ప‌వ‌న్ త్వ‌ర‌లోనే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విల‌న్ పాత్ర‌ను ప్ర‌క...

ఫ‌స్ట్ లుక్‌తో ప‌డ‌గొట్టేశాడు

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు కొన్నేళ్లుగా కాలం క‌లిసి రావ‌ట్లేదు. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు, జాను లాంటి డిజాస్ట‌ర్లు అత‌ణ్ని వెన‌క్కి లాగేశాయి. శ్రీకారంతో బౌన్స్ బ్యాక్ అవుతాడ‌నుకుంటే మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆ సినిమా కూడా ఫెయిల్యూర్‌గానే నిలిచింది. ఇప్పుడిక శ‌ర్వా, అత‌డి అభిమానుల ఆశ‌ల‌న్నీ మ‌హాస‌ముద్రం మీదే ఉన్నాయి. ఐతే చ‌డీ చ‌ప్పుడు లేకుండా మ‌రో సినిమాను పూర్తి చేసి దాంతోనే ముందుగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు శ‌ర్వా. త‌మిళంలో మంచి పేరున్న నిర్మాత అయిన ఎస్.ఆర్.ప్ర‌భు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ‌ర్వా కెరీర్లో తొలిసారిగా పూర్తి స్థాయిలో తెర‌కెక్కుతున్న ద్విభాషా చిత్ర‌మిది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నారు. ఒకేసారి రిలీజ్ కూడా చేయ‌బోతున్నారు. ఒకే ఒక్క జీవితం అనే టైటిల్ ఖరారు చేస్తూ ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను వ‌దిలారు. ఫ‌స్ట్ లుక్ అంటే మామూలుగా హీరోల లుక్సే వ‌దులుతుంటారు. వాళ్లే హైలైట్ అయ్యేలా చూస్తారు. కానీ ఒకే ఒక్క జీవితం ఫ‌స్ట్ లుక్ దానికి భిన్నంగా ఉంది. హీరోను వెనుక నుంచి చూపిస్తూ టైటిల్‌కు త‌గ్గ‌ట్లు సి...

రేప్ కేసుపై స్పందించిన నటుడు!

‘నాగిని 3’ ఫేమ్ పరల్ వి పూరిను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ బాలికను కిడ్నాప్ చేసి కారులో లైంగిక దాడి చేశాడని.. పలుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పరల్ తో పాటు అతడి స్నేహితులపై కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పలువురు బుల్లితెర నటులు, నిర్మాత ఏక్తా కపూర్.. పరల్ వి పూరికి మద్దతుగా నిలిచారు. రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చిన పరల్ దాదాపు రెండు వారాల తరువాత మొదటిసారి ఈ కేసుపై నోరు విప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. కాలం మనుషులను ఎప్పుడూ పరీక్షిస్తూ ఉంటుందని అన్నారు. ఇటీవల తన నాన్నమ్మను కోల్పోయానని.. ఆమె చనిపోయిన 17రోజులకు తన తల్లి క్యాన్సర్ బారిన పడిందని పరల్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ భయంకరమైన ఆరోపణలు తనపై వచ్చాయని.. అప్పటినుండి ప్రతిరోజూ పీడకలలు తనను వెంటాడుతున్నాయని.. ఇవన్నీ తనను కలచి వేశాయని ఆవేదన వ్యకతం చేశారు. తన తల్లి క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో ఆమె పక్క లేకుండా ఓ నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికీ ఈ సంఘటనల న...

మిత్రులు మళ్లీ శత్రువులవుతారా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు కేవ‌లం 900 మంది స‌భ్యులకు ప‌రిమిత‌మైన వ్య‌వ‌హారం. కానీ దీని చుట్టూ జ‌రిగే హ‌డావుడి మామూలుగా ఉండ‌దు. ముఖ్యంగా గ‌త రెండు ప‌ర్యాయాలు మా ఎన్నిక‌లు ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయో తెలిసిందే. ఈసారి అంత‌కుమించిన ర‌చ్చ ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు లాంటి ప్ర‌ముఖులు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగ‌డంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వీరికి తోడు జీవిత‌, హేమ‌, సీవీఎల్ న‌ర‌సింహారావు లాంటి వాళ్లు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తామంటున్నారు. ఐతే ప్ర‌ధానంగా ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణుల మ‌ధ్యే పోటీ కేంద్రీకృతం అవుతుంద‌ని భావిస్తున్నారు. వీరికి ఎవ‌రెవ‌రు మ‌ద్ద‌తునిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వీరి కోసం ప‌రిశ్ర‌మ రెండుగా చీలిపోవ‌చ్చ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఐతే మా ఎన్నిక‌లకు సంబంధించినంత వ‌ర‌కు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి ఎవ‌రికి మ‌ద్దతిస్తే వాళ్లే విజేత‌గా నిలుస్తార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇండ‌స్ట్రీపై ఆయ‌న‌కున్న ప‌ట్టు.. ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కున్న ప‌లుకుబ‌డి అలాంటిది మ‌రి. ఐతే ఆయ‌న ఓపెన...

పెళ్లి పై నయన్ బాయ్ ఫ్రెండ్ రెస్పాన్స్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పలు విషయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మధ్యకాలంలో వీరి పెళ్లి విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది చివర్లో నయన్-విఘ్నేష్ ల పెళ్లి ఉంటుందని ప్రచారం సాగింది. అయితే విఘ్నేష్ మాత్రం ఆ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం తామిద్దరం చాలా బిజీగా ఉన్నామని.. కెరీర్ పరంగా సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. అంతేకాదు.. డేటింగ్ లైఫ్ మీద బోర్ కొట్టినప్పుడు మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తామని కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై విఘ్నేష్ శివన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ”మీరు.. నయన్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు. మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం” అని అడగ్గా.. దానికి విఘ్నేష్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని....

‘వీరమల్లు’ వీడియో వైరల్

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి మేకింగ్ టైంలో ఏ చిన్న విశేషం లీక్ అయినా అది వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఎలాంటిదో తెలిసిందే. ‘పింక్’ సినిమాకు సంబంధించి అప్పట్లో లొకేషన్ నుంచి బయటికొచ్చిన ఒక పిక్ ఎంతటి సంచలనం రేపిందో గుర్తుండే ఉంటుంది. అంతగా క్లారిటీ లేని ఆ పిక్ వైరల్ అవగా.. స్పోర్టివ్‌గానే తీసుకున్న చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం. మేకింగ్ టైంలో ఒక ఫైట్‌కు సంబంధించిన వీడియో సైతం అప్పట్లో వైరల్ అయింది. కాగా ఇప్పుడు పవన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ మల్ల యోధులతో పోరాడే సన్నివేశాలుంటాయని ఇంతకుముందే సంకేతాలు అందాయి. పవన్ బరిసె పట్టుకుని పోజులిస్తున్న ఫొటోలు.. అలాగే మల్ల యోధుల ఫొటోలు అధికారికంగానే విడుదలయ్యాయి. కాగా ఇప్పుడు ఆ యోధులతో పవన్ పోరాడే సన్నివేశాలకు సంబంధించి ఒక చిన్న వీడియో బయటికి వచ్చింది. ఒకవైపు ఆరేడుగురు మల్ల యోధులు సై అంటుంటే.. మరోవైపు పవన్ నిలబడి ఉన్నాడు ఆ వీడియోలో. చుట్టూ మనుషులు కిందికి వంగి కాళ్ల ...

ఇర్ఫాన్ ఖాన్ కొడుకొస్తున్నాడు

గత ఏడాది కరోనా టైంలో చాలామంది సినీ ప్రముఖులు కాలం చేశారు. అందులో సినీ ప్రేక్షకులను చాలా బాధ పెట్టిన మరణాల్లో ఇర్ఫాన్ ఖాన్‌ది ఒకటి. ఐతే ఆయన మరణించింది కరోనాతో కాదు. ఒక అరుదైన క్యాన్సర్ బారిన పడి కొన్నేళ్ల పాటు పోరాడిన ఇర్ఫాన్.. గత ఏడాది కన్నుమూశాడు. ఇర్ఫాన్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్నాడతను. చాలామంది సినీ ప్రముఖుల్లాగే ఆయన కూడా తన కొడుకు బబిల్ ఖాన్‌ను నటనలోకి తేవాలనుకున్నాడు. టీనేజీలో ఉండగానే ఫిల్మ్ కోర్సులు చేయడానికి అతణ్ని విదేశాలకు కూడా పంపించాడు. ఐతే అప్పుడే ఇర్ఫాన్ అనారోగ్యం పాలయ్యాడు. తండ్రి అనారోగ్యం తాలూకు బాధను తట్టుకుంటూనే బబిల్ కోర్సులు పూర్తి చేశాడు. గత ఏడాది తండ్రి చనిపోయిన టైంలో అతను స్వదేశానికి వచ్చి కొన్ని నెలలు తల్లి దగ్గర ఉన్నాడు. తిరిగి ఫారిన్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు కోర్సు పూర్తి చేసుకుని ముంబయికి వచ్చేసిన అతడికి ఒక మంచి ప్రాజెక్టు స్వాగతం పలకడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే ‘ఖాలా’ అనే చిత్రంలో బబిల్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించనున్నాడు....

సురేష్ బాబే దిగిపోయాడంటే..

పోయినేడాది కరోనా-లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డ కొన్ని రోజులకు కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయబోతుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఐతే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో నిర్మాతలు కొంచెం ఆచితూచే వ్యవహరించారు. పరిస్థితులు బాగుపడతాయేమో అని చాన్నాళ్లే ఎదురు చూశారు. ఎంతకీ థియేటర్లు తెరుచుకోక పోవడంతో నిశ్శబ్దం, వి లాంటి పెద్ద సినిమాలను ఓటీటీలకు ఇచ్చేయక తప్పలేదు. ఇవి కాక కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. కొన్ని సినిమాలను మాత్రం పట్టుబట్టి ఆపుకున్నారు. అందుకు తగ్గ ఫలితమే దక్కింది. ఐతే మళ్లీ థియేటర్లకు ఇలాంటి కష్టం ఇంకెప్పుడూ ఉండదని అనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని వాటిని మళ్లీ మూసుకోక తప్పలేదు. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గి తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసినా.. ఏపీలో మాత్రం సాయంత్రం 6 తర్వాత షరతులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడా ఇక్కడా రెండు చోట్లా థియేటర్లు తెరుచుకోలేదు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు గురించి హెచ్చరికలు జారీ అవుతుండటంతో థియేటర్లకు ఎప్పటికి పూర్వపు కళ వస్తుందో తెలియట్లేదు. కొత్త సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసే విషయంలో...

విశ్వ‌క్సేన్‌తో ర‌కుల్ ప్రీత్

తెలుగులో ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు, యాంథాల‌జీ ఫిలిమ్స్ జోరు క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు క‌లిసి కొంచెం పెద్ద స్థాయిలోనే వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఇటీవ‌లే ఆహాలో ఇన్ నేమ్ ఆఫ్ ద గాడ్ పేరుతో కొంచెం పెద్ద స్థాయి వెబ్ సిరీస్ రిలీజైంది. అంత‌కుముందు లెవెంత్ అవ‌ర్ అంటూ పేరున్న సిరీస్ ఒక‌టి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే కుడి ఎడ‌మైతే అంటూ అమ‌లాపాల్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సిరీస్ రాబోతోంది. ఈ కోవ‌లోనే ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్.విజ‌య్.. విశ్వ‌క్సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ ప్ర‌ముఖ ఓటీటీ కోసం ఆంథాల‌జీ ఫిలిం ఒక‌టి తెర‌కెక్కుతోంది. అక్టోబ‌ర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం తెర‌కెక్కుతోంది. ఒక‌ హాలోవీన్ నైట్ జ‌రిగే అనూహ్య ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. ఇందులో ఓ కీల‌క పాత్ర‌కు స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ ఎంపిక కావ‌డం విశేషం. త‌మ‌న్నా, కాజ‌ల్, శ్రుతి హాస‌న్, స‌మంత లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టికే డిజిట‌ల్ డెబ్యూ చేసేయ‌గా.. ర‌కుల్ కొంచెం లేటుగా బ‌రిలోకి దిగుతోంది. విశ్వ‌క్సేన్ లాంటి చిన్న హీరోతో క‌లిసి న‌టించ‌డానికి ఆమె అంగీక‌రించ‌డం విశేష‌మే. ఇందులో నివేథా పెతుర...

క‌త్తి మ‌హేష్‌కు ప్రాణాపాయం త‌ప్పింది కానీ..

వివాదాస్ప‌ద క్రిటిక్ క‌మ్ సోష‌ల్ యాక్టివిస్ట్ క‌త్తి మ‌హేష్‌కు శ‌నివారం యాక్సిడెంట్ జ‌రిగి తీవ్ర గాయాల పాల‌వ‌డం తెలిసిందే. త‌న వ్యాఖ్య‌ల‌తో, చ‌ర్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో ఉండే క‌త్తి మ‌హేష్‌కు ఇలా కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ప‌రిస్థితి ఏంట‌ని తెలుసుకోవ‌డానికి చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నారు. హెల్త్ అప్‌డేట్ కోసం సోష‌ల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఐతే మ‌హేష్ మ‌రీ పెద్ద సెల‌బ్రెటీ ఏమీ కాక‌పోవ‌డం, ఆయ‌న కుటుంబం గురించి మామూలు జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌డం, వారి నుంచి మీడియాకు కూడా స‌మాచారం లేక‌పోవ‌డంతో సందిగ్ధ‌త నెల‌కొంది. ఐతే మ‌హేష్‌కు స‌న్నిహితులైన కొంద‌రు మిత్రులు.. అత‌డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతూ ఫేస్ బుక్, ట్విట్ట‌ర్లో త‌న హెల్త్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. వారి స‌మాచారం ప్ర‌కారం క‌త్తి మ‌హేష్‌కు ప్రాణాపాయం అయితే త‌ప్పింది. కానీ మ‌హేష్ ఆరోగ్య ప‌రిస్థితి కొంచెం ఇబ్బందిక‌రంగానే ఉంది. యాక్సిడెంట్ జ‌రిగాక‌ నెల్లూరులోని మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స అందించిన అనంత‌రం శ‌నివారం రాత్రి మ‌హేష్‌ను చెన్నైకి త‌ర‌లించారు. అక్క‌డి అపోలో ఆసుప‌త్రిలో చేర్చి చి...

సంచ‌ల‌న కేసు నేప‌థ్యంలో స్టార్ హీరో సినిమా

సామాజిక స‌మ‌స్య‌ల మీద సినిమాల్లోనే కాక‌.. బ‌య‌ట కూడా గ‌ట్టిగా గ‌ళాన్ని వినిపిస్తుంటాడు త‌మిళ స్టార్ హీరో సూర్య‌. త‌మిళనాట మ‌హిళ‌ల మీద అఘాయిత్యాలు జ‌రిగిన‌పుడు.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో సూర్య ఆవేద‌న‌తో స్పందించ‌డం చూస్తూనే ఉంటాం. త‌మ‌ అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్య‌క్రమాలు నిర్వ‌హించ‌డ‌మే కాక‌.. ఏవైనా బ‌ర్నింగ్ ఇష్యూస్ న‌డుస్తున్న‌పుడు బాధితుల త‌ర‌ఫున సూర్య వాయిస్ వినిపిస్తుంటాడు. త‌న సినిమాల ద్వారా కూడా ఏదో ఒక మంచి చెప్పాల‌నే ప్ర‌య‌త్నిస్తుంటాడ‌త‌ను. ప్ర‌స్తుతం సూర్య చేస్తున్న ఓ సినిమా కూడా ఓ సామాజిక స‌మ‌స్య చుట్టూ తిరిగేదే. త‌మిళ‌నాట సంచ‌ల‌నం రేపిన ఓ కేసు ఆధారంగా ఈ క‌థ న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్టైన్మెంట్‌లోనే ఇది తెర‌కెక్కుతోంది. రెండేళ్ల కింద‌ట త‌మిళ‌నాడులోని పొల్లాచ్చిలో ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం వ‌ల్ల కొన్ని రోజుల పాటు త‌మిళ‌నాడు అట్టుడికిపోయింది. అప్ప‌ట్లో రాజ‌కీయంగా కూడా ఇది దుమారం రేపిం...

తెలుగు దృశ్యం-2లో ఇలా.. త‌మిళ దృశ్యం-2లో అలా

ముందుగా మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, సింహ‌ళ‌, చైనీస్ భాష‌ల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సూప‌ర్ హిట్ అయిన సినిమా దృశ్యం. ఈ యూనివ‌ర్శ‌ల్ హిట్‌కు సీక్వెల్‌గా మ‌ల‌యాళంలో తెరకెక్కించిన దృశ్యం-2 కొన్ని నెల‌ల కింద‌టే విడుద‌లై అద్భుత‌మైన స్పంద‌న రాబ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత కొన్ని రోజుల‌కే దీని తెలుగు రీమేక్‌ను మొద‌లుపెట్టేశారు. చాలా త‌క్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేసేశారు. ఇప్పుడిక ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ త‌మిళ రీమేక్‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. దృశ్యం రీమేక్ పాప‌నాశంలో క‌థానాయకుడిగా న‌టించిన క‌మ‌ల్ హాస‌న్‌తోనే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆయ‌న‌కు జోడీగా గౌత‌మి న‌టించే అవ‌కాశాల్లేవు. వీళ్లిద్ద‌రూ విడిపోయి దూరం అయిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయ‌డానికి ఆస్కారం లేక‌పోయింది. మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో ట‌నించిన మీనానే.. క‌మ‌ల్‌కు జోడీగా పెడ‌తార‌ని ముందు వార్త‌లొచ్చాయి. కానీ ప్ర‌తి భాష‌లోనూ మీనానే అయితే బాగుండ‌ద‌ని.. వేరే మిడిలేజ్డ్ హీరోయిన్నే ఆ పాత్ర‌కు ఎంచుకుందామ‌ని చూస్తున్నార‌ట‌. తాజాగా...

ప్రోమో షూట్ లో తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా జెమినీ టీవీలో ప్రసారం కానున్న టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతుందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ టీవీ షోకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొని క్లారిటీ ఇచ్చేసింది తమన్నా. స్టార్ ప్లస్ లో ప్రసారమవుతోన్న ‘మాస్టర్ చెఫ్’ కుకింగ్ షోని ఇప్పుడు సౌత్ లోకి తీసుకొస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం తమన్నాను హోస్ట్ గా తీసుకున్నారు. దీనికోసం ఆమెకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ లో పాల్గొంది తమన్నా. ఇదే సమయంలో విజయ్ సేతుపతిని కలిసింది. తమిళ వెర్షన్ కి హోస్ట్ గా విజయ్ సేతుపతి వ్యవహరిస్తున్నారు. బెంగుళూరులో ప్రోమో షూట్ ను ప్లాన్ చేయగా.. తమన్నా, విజయ్ సేతుపతి అక్కడకు చేరుకొని షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. జూలై నెలలో ఈ షోను టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన తమన్నా ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజయ్యాయి. రీసెంట్ గా అమెజాన్ కోసం మరో స...

రూ.150 కోట్లతో ధనుష్ కొత్తిల్లు!

తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాదిలో చెన్నైలోని పోయిస్ గార్డెన్ ప్రాంతంలో కొత్తింటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఇంటి కోసం ధనుష్ ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం బయటకొచ్చింది. దాదాపు 19000 చదరపు గజాల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. నాలుగు అంతస్తులుగా నిర్మిస్తోన్న ఈ భావన కోసం ధనుష్ రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈ ఇంట్లోని గదులను ధనుష్ తనకు నచ్చినట్లుగా స్పెషల్ డిజైన్ చేయిస్తున్నారట. ఇంటీరియర్ డెకరేషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ ఇంటికి దగ్గరలోలోనే ఈ ఇల్లు ఉండడం విశేషం. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ లో ‘గ్రే మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లాడు ధనుష్. తిరిగొచ్చిన తరువాత దర్శకుడు కార్తీక్ నరేన్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ను పునఃప్రాంభించనున్నాడు. రీసెంట్ గా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి అంగీకరించాడు ధనుష్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్...

బన్నీను కన్విన్స్ చేస్తోన్న సుకుమార్!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుటేజ్ ఎక్కువ వస్తుండడంతో రెండు భాగాలుగా సినిమా తీస్తే.. కథను మరింత బాగా చెప్పొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో బన్నీ కూడా దీనికి ఒప్పుకున్నారు. కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ను మరికొద్ది రోజుల్లో పునః ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ లేదా మరో సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ‘ఐకాన్’ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలనుకుంటున్నారట. అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పారట. కానీ ఆయన మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ పూర్తి చేస్తానని...

సొంత కంపెనీ మొదలుపెట్టిన నమిత!

సౌత్ లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఒకప్పుడు ఆమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించేది. ఆ తరువాత కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. శరీర బరువు పెరగడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు రాలేదు. కొన్నాళ్లక్రితం ‘సింహ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఒకట్రెండు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా నమిత తన పేరు మీద ఓటీటీ ఛానెల్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఏకంగా ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఓ పక్క ఓటీటీ పనులు, మరోపక్క సినీ నిర్మాణ పనులు చూసుకుంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. తన పేరు మీద ‘నమిత ఫిలిం ఫ్యాక్టరీ’ అనే బ్యానర్ పెట్టినట్లు చెప్పిన ఈ హాట్ హీరోయిన్ మొదటి సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు చెప్పింది. ముందుగా తన బ్యానర్ పై ‘బౌ బౌ’ అనే సినిమా తీస్తున్నట్లు చెప్పింది. ఇందులో తనే లీడ్ రోల్ చేస్తున్నట్లు.. ఆ తరువాత స్థానం కుక్కదే అని చెప్పింది. తను జంతు ప్రేమికురాలు కావడంతో ఈ సినిమా తీస్తున్నట్లు వెల్లడించింది. ఐదారు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమెకి తెలుగులో అవకాశాలు వస్తున్నట్లు.. కానీ ఇప్పుడు రివీల్ చేయనని అం...

మంచు విష్ణు తెలివిగా కొట్టాడే

అనుకున్నట్లుగానే మంచు విష్ణు కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రేసులోకి వచ్చేశాడు. తాను ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లు విష్ణు ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. తాను తెలుగు సినిమాల్లోనే పెరిగి పెద్దయ్యానని.. సినిమా పరిశ్రమ కష్టాలు, సమస్యలు చూస్తూ పెరిగిన తనకు ‘మా’ సభ్యుల మనోభావాలు, బాధలు బాగా తెలుసని.. తమ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన సినీ పరిశ్రమ రుణం తీర్చుకోవడానికి.. పరిశ్రమకు సేవ చేయడానికి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు విష్ణు. ఇవన్నీ రొటీన్ మాటలే కానీ.. మంచు విష్ణు ప్రకటనలో ‘మా’ సభ్యులను ఆకర్షించే అంశం ఒకటుంది. అదే ‘మా’కు సొంత భవనం నిర్మించుకునే అంశం. ఈ విషయంలో విష్ణు ఒక ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకుముందు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం తాను ఇస్తానంటూ హామీ ఇచ్చిన విషయాన్ని విష్ణు గుర్తు చేశాడు. అయితే బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని చెప్పాడు. ‘మా’ అధ్యక్ష పదవికి ఇప్పటికే పోటీలో నిలిచిన ప్రకాష్ రాజ్.. తన లక్ష...

హీరో డ‌బ్బింగ్ వీడియో చూశారా?

మ‌హేష్ బావ‌.. కృష్ణ అల్లుడు అనే గుర్తింపుతో హీరోగా అరంగేట్రం చేసి కెరీర్ ఆరంభంలో వ‌రుస ఫ్లాపులు, అలాగే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు సుధీర్ బాబు. యాక్టింగ్, లుక్స్, వాయిస్ విష‌యంలో అత‌డి మీద చాలా కౌంట‌ర్లే ప‌డ్డాయి. ఐతే క‌ష్ట‌ప‌డి ఆ లోపాల‌న్నీ దిద్దుకుని జ‌నాల్లో యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడ‌త‌ను. కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, స‌మ్మోహ‌నం, న‌న్ను దోచుకుందువ‌టే సినిమాలు సుధీర్ బాబు మీద ప్రేక్ష‌కుల్లో సానుకూల అభిప్రాయం తీసుకొచ్చాయి. పాత్ర‌ల కోసం అత‌డి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. త‌న సిన్సియారిటీని జ‌నాలు గుర్తించారు. ఇప్పుడు సుధీర్ చేస్తున్న శ్రీదేవి సోడా సెంట‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో మొద‌టి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టం విశేషం. ప‌లాస 1978 ద‌ర్శ‌కుడు క‌రుణ్ కుమార్ రూపొందించిన చిత్ర‌మిది. శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమాకు సుధీర్ బాబు ఇప్ప‌టికే డ‌బ్బింగ్ కూడా చెప్పేశాడు. కొన్ని రోజుల కింద‌టే డబ్బింగ్ మొద‌లుపెడుతున్న‌ట్లు అప్ డేట్ ఇచ్చిన సుధీర్.. తాజాగా ఆ ప‌ని పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డిస్తూ, తాను స...

మ‌న స్టార్లెందుకు న‌మ్మ‌రు?

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసి ద‌శాబ్దంన్న‌ర దాటింది. ఈ కాలంలో ఆయ‌న్నుంచి మంచి మంచి సినిమాలు వ‌చ్చాయి. హ్యాపీడేస్, ఫిదా లాంటి సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న స‌త్తాను చూపించాడు క‌మ్ముల‌. పెద్ద స్టార్లేమీ లేకుండానే ఆయ‌న అంత భారీ విజ‌యాల‌ను అందుకున్నాడు. అలాంటిది శేఖ‌ర్ స్టార్ల‌తో జ‌ట్టు క‌ట్టి.. మంచి సినిమా తీస్తే వాటి స్థాయే వేరుగా ఉంటుంద‌న్న అంచ‌నాలున్నాయి. కానీ క‌మ్ముల ఇప్ప‌టిదాకా ఒక్క పెద్ద స్టార్‌తోనూ సినిమా చేయ‌లేక‌పోయాడు. తాను స్టార్ల‌తో సినిమాలు చేయ‌డానికి రెడీ అంటుంటాడు కానీ.. ఇత‌ను వాళ్ల‌ను సంప్ర‌దించ‌డా.. లేక వాళ్లే ఇత‌డితో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌రా అన్న‌ది అర్థం కాదు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. క‌మ్ముల శిష్యుడైన నాగ్ అశ్విన్ రెండు క్లాస్ సినిమాలే తీసి ఏకంగా ప్ర‌భాస్‌తో సినిమా చేసే అవ‌కాశం ప‌ట్టేశాడు. కానీ శేఖ‌ర్ మాత్రం ఇప్ప‌టిదాకా తెలుగులో పెద్ద స్టార్‌తో ఒక్క సినిమా కూడా చేయ‌లేక‌పోయాడు. ఇప్పుడు ల‌వ్ స్టోరీలో న‌టించిన నాగ‌చైత‌న్య‌నే క‌మ్ముల ఇప్ప‌టిదాకా చేసిన హీరోల్లో కొంచెం రేంజ్ ఉన్నవాడు. ఆ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు హిట్ట‌యితే అయినా బ‌డ...

దిల్ రాజు సేఫ్ గేమ్

నిర్మాత దిల్ రాజుకు టాలీవుడ్లో ఉన్న పేరు ప్ర‌ఖ్యాతుల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. సినిమాల క్వాలిటీ ప‌రంగా చూసుకున్నా, క్వాంటిటీ ప‌రంగా చూసుకున్నా ఆయ‌న టాలీవుడ్లో ఇప్పుడు టాప్ ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌రు. రెండు ద‌శాబ్దాలుగా ఆయ‌న నిల‌క‌డ‌గా టాలీవుడ్లో త‌న ఆధిప‌త్యాన్ని చాటుతున్నారు. ఐతే ఇప్పుడు రాజుకు దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాల‌ని ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఓవైపు విజ‌య్‌తో ద్విభాషా చిత్రం ద్వారా త‌మిళంలో అడుగు పెట్ట‌బోతున్నాడు. మ‌రోవైపు బాలీవుడ్లో వ‌రుస‌గా మూడు సినిమాలు నిర్మిస్తూ ఉత్త‌రాదినా తన ప్రాబ‌ల్యాన్ని చాటి చెప్పాల‌ని చూస్తున్నాడు. ఐతే హిందీలో రాజు చేస్తున్న మూడు చిత్రాలూ రీమేక్‌లే కావ‌డం విశేషం. ముందుగా జెర్సీ రీమేక్‌ను మొదలు పెట్టిన రాజు.. ఆ త‌ర్వాత ఎఫ్‌-2 రీమేక్‌ను లైన్లోకి తెచ్చాడు. తాజాగా నాంది రీమేక్‌ను కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఆయ‌న్ని రీమేక్ రాజు అనేస్తున్నారు అంద‌రూ. ఐతే బాలీవుడ్లో రాజు తెలివిగా అడుగులు వేస్తున్నాడ‌న్న‌ది స్ప‌ష్టం. త‌న‌కు గ్రిప్ లేని ఇండ‌స్ట్రీలో నేరుగా స్ట్రెయిట్ చిత్రాలు… అందులోనూ భారీ స్థాయివి తీసి రిస్క్ చేయ‌డం ఎందుకని రాజు ఆలోచిస్తున్న‌...

ప‌వ‌న్ అభిమానుల‌కు హ‌రీష్ కిక్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాక ఖరారు చేసుకున్న ప్రాజెక్టుల్లో ఆయ‌న అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేసిన సినిమా అంటే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌దే. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబోలో సినిమా అంటే అంచ‌నాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? అస‌లు ప‌వ‌న్ రీఎంట్రీ మూవీ ఇదే అయితే బాగుండ‌ని అభిమానులు కోరుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ముందుగా వ‌కీల్ సాబ్ ప‌ని ముగించిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత హ‌రహ‌ర వీర‌మ‌ల్లు, అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఇవి పూర్త‌య్యాకే హ‌రీష్ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఐతే ఎంత ఆల‌స్యం అయిన‌ప్ప‌టికీ.. వేరే ప్రాజెక్టు చూసుకోకుండా ఈ సినిమా మీదే త‌న ఫోక‌స్ మొత్తం పెట్టేసి కూర్చున్నాడు హ‌రీష్‌. ఈ సినిమా ఆల‌స్యం అవుతున్న‌ప్ప‌టికీ.. దాని విష‌యంలో ప‌వ‌న్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ త‌గ్గ‌కుండా చూసుకుంటున్నాడు హ‌రీష్‌. కొన్ని సినిమా వేడుక‌ల్లో.. ట్విట్ట‌ర్లో ప‌వ‌న్‌తో చేయ‌బోయే సినిమా ఎలా ఉండ‌బోతోందో హింట్లు ఇస్తున్నాడత‌ను. అభిమానుల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే సినిమా ఉంటుంద‌ని.. త...

‘ఆదిపురుష్’తో మనం కనెక్టవగలమా?

ప్రభాష్ చేతిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాక ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సిినమాలే చేస్తున్నాడు కానీ.. వాటిలో చాలా వరకు బేసిగ్గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలే ఉన్నాయి. ఒక్క ‘ఆదిపురుష్’ మాత్రమే మనం పరభాషా చిత్రంగా చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం. మిగతా భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. దీన్ని రూపొందిస్తున్నది బాలీవుడ్ దర్శకుడైన ఓం రౌత్. నిర్మాతలూ అక్కడి వాళ్లే. ఐతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలనుకున్నపుడు దక్షిణాది భాషలకు చెందిన నటీనటుల్ని కూడా ఎంచుకోవాల్సింది. కానీ పూర్తిగా బాలీవుడ్ నటులతోనే ఈ చిత్రాన్ని నింపేస్తున్నారు. కథానాయిక కృతి సనన్‌కు సౌత్‌లో పెద్ద గుర్తింపేమీ లేదు. తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా అవి డిజాస్టర్లవడంతో ఆమెను ఇక్కడి వాళ్లు గుర్తుంచుకోలేదు. ఇక విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, అభిమన్యుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ బాలీవుడ్ నటులే. ఇప్పుడేమో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటుడైన దేవ్ దత్‌ను సెలక్ట్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. దేవ్ దత్ చేయబ...

పుష్ప‌-1లో అత‌డికి మూడు సీన్లే

పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒక‌టి పుష్ప‌. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత అల్లు అర్జున్, రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇందులో విల‌న్ పాత్ర‌కు మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్ ఎంపిక కావ‌డం సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. మ‌ల‌యాళంలో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో ఫాహ‌ద్ తిరుగులేని న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మ‌ధ్య‌ ఓటీటీల్లో ఫాహ‌ద్ సినిమాలు చూస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అత‌డి స్థాయి ఏంటో తెలుస్తోంది. కుంబ‌లంగి నైట్స్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో ఫాహ‌ద్ న‌ట‌న చూసిన వాళ్ల‌కు పుష్ప సినిమాలో సుకుమార్ అత‌ణ్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. బ‌న్నీతో అత‌డి క‌ల‌యిక‌లో ఎలాంటి సీన్లు ఉంటాయో అన్న ఎగ్జైట్మెంట్ క‌ల‌గ‌డం ఖాయం. ఐతే పుష్ప‌ను ఈ మ‌ధ్య‌నే రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో అందుకు త‌గ్గ‌ట్లు స్క్రిప్టును మార్చాల్సి వ‌చ్చింది. ఫాహ‌ద్ ఫాజ‌ల్ పాత్ర‌ను బేస్ చేసుకునే ఈ క‌థ‌ను రెండుగా విభిజించినట్లు స‌మాచారం. ఆ పాత్ర‌కు ఫ‌స్ట్ పార్ట్‌లో స్క్రీన్ టైం చాలా త‌క్కువ‌ట‌. రెండో పార్ట్‌కు ఫాహ‌ద్ పాత్ర హైలైట్ అయ్యేలా...

చరణ్‌కు వచ్చిన సమస్యే.. రామ్‌కు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలా రెండు నెలల్లో ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసేసి శంకర్ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు చరణ్. కానీ శంకర్ ఆ సమయానికి సినిమాను ఆరంభించే స్థితిలో ఉంటాడా అన్నది సందేహంగానే ఉంది. ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఫిలిం ఛాంబర్లోనూ ఈ విషయమై ఫిర్యాదు చేసి చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టకుండా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు లైకా అధినేతలు. ఈ నేపథ్యంలో చరణ్-శంకర్ సినిమా మీద సందిగ్ధత నెలకొంది. కాగా ఇప్పుడు మరో టాలీవుడ్ కథానాయకుడికి ఇలాగే ఓ తమిళ దర్శకుడితో తలనొప్పి తప్పేలా లేదు. ఆ హీరో రామ్ కాగా.. దర్శకుడు లింగుస్వామి. రామ్-లింగుస్వామి కలయికలో సినిమా గురించి కొన్ని నెలల కిందటే ప్రకటన రావడం తెలిసిందే. ఇటీవలే లింగుస్వామి తనకు స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ ఇచ్చాడని.. తనకది బాగా నచ్చిందని.. త్వరలోనే సినిమా మొదలుపెడతామని రామ్ ట్విట్టర్లో వెల్డడించాడు కూడా. ఐతే ఈల...

ప్రకాష్ రాజ్ కోసం వర్మ బ్యాటింగ్

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఎవరో ఒకరిని గిల్లుతూ వివాదాస్పద ట్వీట్లు వేయడం ఆయనకు అలవాటు. ఐతే కొన్నిసార్లు మాత్రం వర్మ కీలకమైన విషయాల మీద లాజికల్ ట్వీట్లతో జనాల్లో ఆలోచన రేకెత్తిస్తుంటాడు. ఇప్పుడు ఇదే కోవలో ఒక హాట్ టాపిక్ మీద స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ కొందరు లేవనెత్తిన వాదనను ఆయన తనదైన శైలిలో తిప్పి కొట్టాడు. ఈ వాదనపై ఇప్పటికే ప్రకాష్ రాజ్‌తో పాటు నాగబాబు, బండ్ల గణేష్ లాంటి వాళ్లు బలంగా వాదన వినిపించారు. ఇప్పుడు వర్మ లాజికల్ పాయింట్లతో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే వాళ్ల నోళ్లకు మూత వేయించే పనిలో పడ్డాడు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే.. ఈ కోవలోకి వచ్చే దిగ్గజాలు చాలామందే ఉన్నారని వర్మ ఉదాహరణలు చూపించాడు. “కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు …బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన బాబు గారు లోకలా??? ఎలా ఎలా ఎలా?? అలాగే మహారాష్ట్ర నుండి ఎక్...

విషమంగా కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి

అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు.. బిగ్ బాస్ ఫేం కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. తొలుత స్వల్ప గాయాలు తగిలినట్లుగా వార్తలు వచ్చినప్పటికి అందులో నిజం లేదని చెబుతున్నారు. కోల్ కతా నేషనల్ హైవే మార్గంలో నెల్లూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున (శనివారం) చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం లో ఆయన తలకు బలమైన గాయం తగిలినట్లుగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పెషల్ ఐసోలేషన్ లో వెంటిలేటర్ మీద చికిత్స చేస్తున్న వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు.. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత స్వల్ప గాయాలుగా పేర్కొనటంతో ఊపిరి పీల్చుకున్న ఆయన కుటుంబ సభ్యులు.. అభిమానులు గంటలు గడిచే కొద్దీ వస్తున్న సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరికొద్ది గంటల్లో కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేస్తారని చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మెడికవర్ ఆసుపత్ర...

పుష్ప‌.. ఇండియాలో నంబ‌ర్ వ‌న్

అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాపై మ‌న ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలిసిందే. ఐతే దేశంలోని ఇత‌ర భాష‌ల వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ ఇది. ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ఎప్ప‌టికప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల జాబితా ఇస్తుంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత మ‌ళ్లీ ఇండియాలో అన్ని ఫిలిం ఇండ‌స్ట్రీలూ రీస్టార్ట్ దిశ‌గా అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో ఈ ఏడాది రాబోయే చిత్రాల్లో వేటి కోసం అత్యంత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారా అని ఐఎండీబీలో చూస్తే.. ఈ జాబితాలో పుష్ప అగ్ర‌స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇండియా మొత్తంలో అత్య‌ధిక అంచ‌నాలున్న చిత్రం పుష్ప‌నే కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఈ చిత్రానికి 27 శాతానికి పైగా ప్రేక్ష‌కులలు అనుకూలంగా ఓటేయ‌డం విశేషం. కేజీఎఫ్-చాప్ట‌ర్ 2 లాంటి క్రేజీ సినిమాను పుష్ప వెన‌క్కి నెట్టింది. కేజీఎఫ్‌-2కు అనుకూలంగా 18.5 శాతం ఓట్లు ప‌డ్డాయి. అది రెండో స్థానంలో ఉండ‌గా.. మ‌రి కొన్ని రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ కానున్న తాప...

బాలీవుడ్ ఆశ‌ల‌కు మ‌ళ్లీ బ్రేక్

పోయినేడాది క‌రోనా మ‌హ‌మ్మారి కొట్టిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు బాలీవుడ్. ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత టాలీవుడ్ స‌హా కొన్ని ఇండ‌స్ట్రీలు కోలుకుని సినిమాలు రిలీజ్ చేసుకున్నాయి. మంచి వ‌సూళ్లే రాబ‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి నుంచి మూణ్నాలుగు నెల‌ల పాటు తెలుగు చిత్రాల సంద‌డి ఎలా సాగిందో తెలిసిందే. కానీ బాలీవుడ్లో మాత్రం ఏడాదికి పైగా క‌ళే లేదు. అక్క‌డ కాస్త పేరున్న సినిమాలేవీ విడుద‌ల కాలేదు. ఓటీటీలో కొన్ని సినిమాలు సంద‌డి చేయ‌డ‌మే త‌ప్పితే.. థియేట‌ర్ల‌లో క‌ళ లేక‌పోయింది. బాలీవుడ్‌కు దీని వ‌ల్ల వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది. ఈ వేస‌వికి మ‌ళ్లీ క‌ళ వ‌స్తుంద‌నుకుంటే.. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి దెబ్బ కొట్టింది. ఐతే సెకండ్ వేవ్ ఉద్దృతి త‌గ్గాక గ‌త ఏడాది లాగా స్త‌బ్దుగా ఉండిపోకుండా.. ఈసారి దూకుడుగా సినిమాలు రిలీజ్ చేయాల‌నుకుంది బాలీవుడ్. ఈ దిశ‌గానే ముందుగా అక్ష‌య్ కుమార్ సినిమా బెల్‌బాటమ్ రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. మ‌రిన్ని సినిమాలనూ లైన్లో పెట్టారు. సెకండ్ వేవ్ త‌ర్వాత దేశంలో ముందుగా థియేట‌ర్ల‌ను తెరిచింది మ‌హారాష్ట్ర‌లోనే అన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులు పాత సినిమాల‌ను న‌డిపించి జ‌నాల...

రాధేశ్యామ్ డీల్ డ‌న్?

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన సాహో పెద్ద డిజాస్ట‌ర్. అయితేనేం.. ఆ ప్ర‌భావం ఏమీ ప్ర‌భాస్ కొత్త చిత్రాల మీద క‌నిపించ‌ట్లేదు. వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు.. అంత‌కుమించి బిజినెస్ ఆఫ‌ర్ల‌తో ప్ర‌భాస్ స్థాయి ఏంటో చూపిస్తున్నాయి అత‌డి కొత్త చిత్రాలు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల్లోకెల్లా లో బ‌జ్ ఉన్న రాధేశ్యామ్‌కు కూడా ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి క్రేజే ఉన్న సంగ‌తి స్ప‌ష్టంగా తెలుస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల‌కు హోల్‌సేల్‌గా కొనేసి డిజిట‌ల్ రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌ముఖ ఓటీటీ ముందుకొచ్చిన‌ట్లు వార్త‌లు రావ‌డం తెలిసిందే. కానీ రాధేశ్యామ్ మేక‌ర్స్ ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించార‌ట‌. థియేట్రిక‌ల్ హ‌క్కుల‌తో పాటు డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్‌ను విడి విడిగా అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం రాబ‌ట్ట‌వ‌చ్చ‌న్న‌ది వాళ్ల ఆలోచ‌న‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే రాధేశ్యామ్ డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కుల‌ను యువి క్రియేష‌న్స్ సంస్థ భారీ మొత్తానికి అమ్మేసిన‌ట్లు సమాచారం. హిందీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని జీ5 స్ట్రీమ్ చేయ‌నుంద‌ట...

అన‌సూయ హ‌ర్టు.. త‌ర్వ‌తేమైంది?

టీవీ షోల‌కు సంబంధించి ప్రోమోలు క‌ట్ చేయ‌డంలో వాటి డైరెక్ట‌ర్లు మ‌హా తెలివినే ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఆయా షోల్లో ఏదో జ‌ర‌గ‌రానిది జ‌రిగిపోయిన‌ట్లు.. పెద్ద గొడ‌వ అయిన‌ట్లుగా చిత్రీక‌రిస్తూ ప్రోమోలు వ‌దులుతుంటారు. అవి చూసి త‌ర్వాతి ఎపిసోడ్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తారు. తీరా ఆ ఎపిసోడ్ చూస్తే అంతా డ్రామా అని తెలుస్తుంది. ప్రోమోల్లో చూపించినంతగా ఏమీ జ‌రిగిపోలేద‌ని తేలుతుంది. ఇలాంటి అనుభ‌వాలు కొత్తేమీ కాదు. అయినాస‌రే.. మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌నాల చెవుల్లో పూలు పెడుతూనే ఉంటారు. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలోనూ తాజాగా ఇదే జ‌రిగింది. ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్‌లో హైప‌ర్ ఆది స్కిట్ సంద‌ర్బంగా ఓ వివాదం నెల‌కొన్న‌ట్లుగా ప్రోమో క‌ట్ చేయ‌డం తెలిసిందే. ఈ స్కిట్‌కు అతిథిగా వ‌చ్చిన శివ అనే యూట్యూబ్ యాంక‌ర్ త‌న డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్య‌ల‌తో అన‌సూయ హ‌ర్ట‌యి షో నుంచి వాకౌట్ చేసిన‌ట్లుగా చూపించారు. ప్రోమోలో అయితే వ్య‌వ‌హారం చాలా సీరియ‌స్ అయిన‌ట్లే క‌నిపించింది. ఐతే ఇంత‌కీ ఏం జ‌రిగిందా అని ఎపిసోడ్ చూసిన వాళ్లంతా ఫూల్స్ అయిపోయారు. పొట్టి పొట్టి బ‌ట్ట‌లేయ‌డం గురించి జ‌నాలు చేసే కామెంట్లు చూస్తే ఏమ‌నిపిస్త...

ధ‌నుష్‌ను మెప్పించిన తెలుగు ద‌ర్శ‌కుడ‌త‌డేనా?

ఉన్న‌ట్లుండి త‌మిళ స్టార్ హీరోల చూపు టాలీవుడ్ మీద ప‌డుతోంది. ఒక‌ప్ప‌టితో పోలిస్తే త‌మిళ సినిమాల క్వాలిటీ ప‌డిపోగా.. అక్క‌డి స్టార్ డైరెక్ట‌ర్లు ఒక్కొక్క‌రుగా ఫామ్ కోల్పోతున్నారు. అదే స‌మ‌యంలో గ‌త కొన్నేళ్ల‌లో జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు, వాటి డైరెక్ట‌ర్లకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఇండియాలో టాలీవుడ్ ఉన్న ఊపులో మ‌రే ఇండ‌స్ట్రీ లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే తెలుగు ద‌ర్శ‌కుల‌తో బ‌హుభాషా చిత్రాలు చేయ‌డానికి త‌మిళ స్టార్లు ఆస‌క్తి చూపిస్తున్నారు. విజ‌య్.. వంశీ పైడిప‌ల్లితో, ధ‌నుష్‌.. శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమాలు ఖ‌రారు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సూర్య.. బోయ‌పాటి శ్రీను, త్రివిక్ర‌మ్‌ల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లొస్తున్న సంగతి తెలిసిందే. కాగా క‌మ్ముల సినిమా త‌ర్వాత ధ‌నుష్ మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడికి క‌మిట్మెంట్ ఇచ్చిన‌ట్లుగా తాజాగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రొమాంటిక్ సినిమాలు తీసే యువ ద‌ర్శ‌కుడు అంటూ ధ‌నుష్ ఇంప్రెస్ అయిన డైరెక్ట‌ర్ గురించి మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఆ ద‌ర్శ‌కుడు.. వెంకీ అట్లూరి అని తెలుస్తోంది. వెంకీ తొలి చిత్రం తొలి ప్రేమ‌.. ఆ త‌ర్వాత తీసిన మిస్ట‌ర్...

హాట్ స్టార్‌లో మాస్ట్రో?

నితిన్ కొత్త సినిమా మాస్ట్రో ఓటీటీ రిలీజ్ విష‌యంలో ఇక సందేహాలేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి థియేట్రిక‌ల్ రిలీజ్ ఉండ‌ద‌న్న‌ది దాదాపు ఖాయ‌మే. ఒక ప్ర‌ముఖ ఓటీటీలో ఈ సినిమా నేరుగా డిజిట‌ల్ రిలీజ్‌కు రెడీ అయిన‌ట్లు కొన్ని రోజుల కింద‌టే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఓటీటీ హాట్ స్టార్ అని స‌మాచారం. ఇప్ప‌టిదాకా తెలుగు చిత్రాల‌ను ఎక్కువ‌గా అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మాత్ర‌మే త‌మ ఫ్లాట్ పామ్స్‌లో నేరుగా రిలీజ్ చేసేవి. హాట్ స్టార్ తెలుగు చిత్రాల‌పై ఎప్పుడూ పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌లేదు. థియేట్రిక‌ల్ రిలీజ్ త‌ర్వాత కూడా హాట్ స్టార్ హ‌క్కులు కొని స్ట్రీమ్ చేసిన తెలుగు చిత్రాలు చాలా త‌క్కువ‌. ఆ ఓటీటీలో తెలుగు సినిమాలే అంత‌గా క‌నిపించ‌వు. ఐతే ద‌క్షిణాదిన మార్కెట్‌ను విస్త‌రించ‌డంపై మిగ‌తా ఓటీటీల్లాగే హాట్ స్టార్ కూడా దృష్టిపెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మాస్ట్రో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. నితిన్ సొంతం సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో తెర‌కెక్కిన మాస్ట్రో సినిమాకు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించా...

చిరు.. ప్రకాష్ రాజ్.. మధ్యలో నాగబాబు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసకందాయంలో పడేట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడమే కాదు.. ‘మా బిడ్డలు’ పేరుతో తన ప్యానెల్‌ను సైతం ప్రకటించారు. వాళ్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి తన ఉద్దేశాల్ని, లక్ష్యాల్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం పాల్గొనడం విశేషం. ఆయన ప్రకాష్ రాజ్ ప్యానెల్లో లేరు. ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కానీ ఈ ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నారు. కాగా తాను ప్రకాష్ రాజ్ అండ్ కోకు ఎందుకు మద్దతు ఇస్తున్నది నాగబాబు వెల్లడించారు. అంతే కాక ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు ఇస్తారని కూడా నాగబాబు ప్రకటించడం విశేషం. ఇంకా ఈ విషయమై నాగబాబు ఏమన్నారంటే.. రెండు నెలల కిందటే ప్రకాష్ రాజ్ తన దగ్గరికొచ్చి ‘మా’లో పరిస్థితుల గురించి మాట్లాడాడని.. ‘మా’ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఏం చేయాలో వివరించారని.. ఆయన మాటలు విన్నాక తనకు నమ్మకం కలిగిందని నాగబాబు చెప్పారు. ప్రకాష్ రాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ముచ్చట పడ్డానని.. ‘మా’ కోసం కూడా ఆయన ఎంతో చేస్తారనిపించిందని ఆయనన్నారు. ప్రకాష్ రాజ్ ‘న...

ఒక్క ఫస్ట్ లుక్‌కి ఇంత హంగామా ఏంటో?

వాలిమై.. వాలిమై.. వాలిమై.. ఇప్పుడు తమిళ సినీ ప్రేక్షకుల నోళ్లలో ఎక్కడ చూసినా ఇదే మాట నానుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కార్తితో ‘ఖాకి’ సినిమా తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంతకుముందే అతను అజిత్‌తో ‘పింక్’ రీమేక్ తీశాడు. అది మంచి విజయమే సాధించింది. ఈసారి సొంత కథతో అజిత్ హీరోగా తీస్తున్న థ్రిల్లర్ మూవీ ‘వాలిమై’. ఇందులో తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఏడాది కిందటే మొదలైంది. కానీ కరోనా ఇతర కారణాలతో షూటింగ్ ఆలస్యమైంది. ఐతే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా మొదలయ్యాక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూడటం ఖాయం. సినిమా ఆరంభ దశలో ఉండగానే ఈ అప్‌డేట్ ఆశిస్తారు అభిమానులు. కానీ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. ‘వాలిమై’ అప్ డేట్ కోసం ఏడాది నుంచి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ‘వాలిమై అప్ డేట్ ప్లీజ్’ అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా ఇంగ్లాండ్‌లోన...

నాని స్పీడే స్పీడబ్బా

తెలుగులో చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో నాని ఒకడు. ఒకప్పుడైతే నాని సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌ల రేంజ్ తక్కువుండేది. చకచకా సినిమా అవగొట్టేసేవాడు. కానీ ఇప్పుడు అతడి సినిమా స్థాయి పెరిగింది. అతను మిడ్ రేంజ్ స్టార్ అయ్యాడు. అతడి సినిమాల మీద రూ.30 కోట్లకు మించి బడ్జెట్లు పెడుతున్నారు. అందులోనూ ‘శ్యామ్ సింగరాయ్’ అయితే నాని కెరీర్లోనే అత్యధికంగా.. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతోంది. నాని కెరీర్లోనే ఏ చిత్రానికీ లేనంత వర్క్.. శ్రమ ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి. మూడు దశాబ్దాల కిందటి కోల్‌కతా నగర నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టి కోల్‌కతా సిటీ సెట్ వేశారు. మధ్యలో కొన్ని రోజులు కోల్‌కతాకు కూడా వెళ్లి వచ్చింది చిత్ర బృందం. లాక్ డౌన్ రాకుంటే ఈపాటికి సినిమా విడుదలకు సిద్ధం అయ్యేదే. మధ్యలో విరామం వచ్చినా సరే.. సినిమా మరీ ఏమీ ఆలస్యం కాలేదు. లాక్‌డౌన్‌కు ముందే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఇంత భారీ చిత్రాన్ని కూడా నాని మొత్తంగా మూడు నెలల్లో పూర్త...

రాధేశ్యామ్.. ఓ పనైపోతుంది బాబూ

లాక్ డౌన్-2 విరామానికి ముందు ప్రభాస్ సినిమాలు మూడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. అవే.. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్. మొదటి సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. రెండోది మధ్య దశలో ఉంది. చివరి చిత్రం షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే జరిగింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్‌కు అనుమతులు లభించిన నేపథ్యంలో ఆ మూడు చిత్రాల బృందాలూ ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి. ముందుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ పని మొదలుపెడతాడని ఇంతకుముందు వార్తలు రాగా.. ఆ తర్వాత ‘సలార్’ కోసం పని చేస్తాడని ప్రచారం సాగింది. తర్వాతేమో ‘రాధేశ్యామ్’ షూటింగ్ పున:ప్రారంభిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఐతే బ్రేక్ తర్వాత ప్రభాస్ ఏ సినిమా పని మొదలుపెడుతున్నాడో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ సెట్లోకే ప్రభాస్ అడుగు పెట్టాడు. ‘రాధేశ్యామ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు హీరోయిన్ పూజా హెగ్డే శుక్రవారం అప్‌డేట్ ఇచ్చింది. ఆమె షూటింగ్‌లో అడుగు పెట్టిందంటే ఆటోమేటిగ్గా ప్రభాస్ కూడా వస్తున్నట్లే. ఈ సినిమా చిత్రీకరణ ఇంకో రెండు మూడు వారాలే మిగిలి ఉంది. అది కాన్చిచ్చేస్తే ...

చిరును లాగొద్దంటున్న ప్రకాష్ రాజ్

ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. ఇంతలోనే హడావుడి మొదలైపోయింది టాలీవుడ్లో. గత మూణ్నాలుగు రోజులుగా అటు టాలీవుడ్లో.. ఇటు మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడంతో ఈ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆయనకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించడంతో ఆసక్తి రెట్టింపైంది. నాగబాబు సపోర్ట్ చేశాడంటే.. ఆటోమేటిగ్గా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్‌కే ఉంటుందని.. చిరు సపోర్ట్ చేశాడంటే ప్రకాష్ రాజ్ గెలుపు లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే తన మిత్రుడైన మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా అధ్యక్ష బరిలో నిలుస్తున్న నేపథ్యంలో చిరు.. ఓపెన్‌గా ఎవరికీ తన మద్దతు ప్రకటించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా చిరంజీవి మద్దతు గురించి మాట్లాడినపుడల్లా ప్రకాష్ రాజ్ మాట దాట వేస్తుండటం గమనార్హం. ఆయన మద్దతు తనకు ఉందని ఆయన అనట్లేదు. ముందుగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినపుడు.. చిరు ఎవరు మంచి చేస్తారనిపిస్తే వాళ్లకే మద్దతిస్తారంటూ వ్యాఖ్యానించాడు ప్రకాష్ రాజ్. తాజాగా తన ప్య...

ఊరకనే ఎవరూ మెగాస్టార్ అయిపోరు…

చిరంజీవి వేషాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల నుంచి.. హీరోగా అవకాశాలు అందుకున్న వరకు అత్యంత సామాన్యమైన జీవన శైలి తో ఉండేవాడు… ఇంటి దగ్గర్నుంచి వచ్చిన డబ్బు ని పొదుపుగా వాడుకుంటూ మెస్ టిక్కెట్స్.. రోజూ ఒక ఫ్రూట్ జ్యుస్.. మాత్రమే తాగుతూ..కాఫీ టీ ల జోలికి వెళ్లకుండా.. వేషాల కోసం ప్రయత్నం చేసేవాడు.. ఈ దశ లో అతని రూమ్ మేట్స్ సుధాకర్.. హరిప్రసాద్.. విజయరాఘవ రోడ్ లో ఆంధ్రాక్లబ్ కి ఎదురుగా ఉండేది.. అప్పటి నుండీ తనకి తన భవిష్యత్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ ఉండేది.. ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నిర్మాత క్రాంతికుమార్ తన డబ్బింగ్ వేరే వాళ్ల తో చెప్పిద్దాం అనే ఆలోచన లో ఉండేవాడు.. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన నిద్ర లేవక ముందే వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అక్కడే కూర్చుని ఉండేవాడు.. ఏంటి.. ఇంత పొద్దున్నే వచ్చావ్ ?.. అంటే.. ‘అదే.. అదీ.. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిద్దామనుకుంటున్నట్టు తెలిసింది.. నేనే చెబుతాను.. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోతే అప్పుడు మార్చండి’ అని భయంభయంగా అడిగేవాడు… ‘సరే.. చూద్దాంలే’.. అనేవరకు అక్కడే ఉండేవాడు.. మరల రెండో రోజు.. మూడోరోజు… సేమ్… చివరికి ఒకదశలో క్రాంతికుమార్....

ఎన్నికల్లో పోటీకి ప్రకాశ్ రాజ్ అంత గ్రౌండ్ వర్కు చేశారా?

సార్వత్రిక ఎన్నికలో.. ఉప ఎన్నికలో అయితే ఎంత రాజకీయం ఉంటుందో.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా అంతే రాజకీయం నడుస్తోంది. వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఈ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఎన్నికలు జరగటానికి మరో మూడు నెలల సమయం ఉంది. ఎప్పుడైతే ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారో అప్పటి నుంచి వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ప్రకాశ్ రాజ్ ఎందుకు పోటీ చేస్తున్నట్లు? ఆయన పోటీ చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఆయన వెనుక ఉన్నదెవరు? పర భాషా నటుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. మరి.. ఇలాంటి ప్రశ్నలకు ప్రకాశ్ రాజ్ ను అడిగితే ఆయనేం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం చెప్పారంటే.. ఒక రోజులో హటాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చాలా మథనం ఉంది. ఈ పరిశ్రమ నాకు పేరు.. హోదా.. గౌరవం ఇచ్చింది. అలాంటప్పుడు ఇక్క...